సూర్యాపేట జనగాం రోడ్ లోని బాలెంల ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత వారం పది రోజులుగా వడ్లు కొనుగోలు జరపడం లేదని, గత కొద్దిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకలు ఎత్తుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీవో, ఎంఆర్ఓ ఇతర అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప, దాన్యం కొనుగోలు జరిపేలా చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు జరపాలని రోడ్డుపై ధర్నా చేపట్టారు.