సంత జరిగే ప్రాంతాల్లో దొంగలు ఉంటారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్సి హరినాథ్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో జరిగిన సంత బజార్ లో సురక్ష కళ బృందం చేత అవగాహన కల్పించినట్లు తెలిపారు. సంత బజార్ లో రద్దీగా ఉండే ప్రదేశాల్లో దొంగలు ఉంటారని విలువైన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవాలని అన్నారు. అపరిచితుల ఇచ్చే తినుబండారాలు తీసుకోరాదని అన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన, సంచరిస్తున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కళ బృందం సభ్యులు, న్ కానిస్టేబుల్ రామచంద్రయ్య పాల్గొన్నారు.