తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఓఆర్ఆర్ లీజు విషయంలో నిబంధనలు పాటించలేదని విమర్శించారు. ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడే వెనకేసుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని, బేస్ ప్రైస్ ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. రూల్ ప్రకారమే లీజుకు ఇచ్చామంటూ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.