విద్యార్థుల హక్కుల సాధనలో ఎస్ ఎఫ్ ఐ కీలక పాత్రను పోషిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చెప్పారు. దామరచర్లలో జరుగుతున్న ఎస్ ఎఫ్ ఐ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులలో మూడవ రోజు బుధవారం ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. విద్యారంగంపై మతోన్మాద శక్తుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని ఆయన చెప్పారు. చరిత్రను పాలకులు మరిచి పోవద్దని చెప్పారు. రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి 30%నిదులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలు అన్ని విద్యా సంస్థలు లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. బంగారు తెలంగాణ రాష్ట్రంలో బంగారు భవిష్యత్ కలిగిన విద్యార్థులు సరైన బాటలో నడావాలంటే ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువుల కోసం బకాయిలో వున్న స్కాలర్ షిప్ ఫీజు , రీయింబర్స్ విడుదల జ్యాపం చేయకుండా తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు. పేధ మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.