హైదరాబాద్ లో పబ్బుల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ ముగిసింది. పబ్బుల నిర్వహణ విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముగ్గురు కమిషనర్ లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంంటలు దాటాక ఎలాంటి మ్యూజిక్ సిస్టమ్ ఉండకూడదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.