మంచు విష్ణు తన కొత్త చిత్రం "జిన్నా" ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
ఈ విషయం పక్కన పెడితే, రీసెంట్గా విష్ణు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. ఎందుకంటే, రీసెంట్గా విడుదలైన ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ తనను చీట్ చేసినట్టనిపించిందని, ఆ సినిమాలోని విజువల్స్ కార్టూనిష్ గా ఉన్నాయని విష్ణు అన్నారని ప్రచారం జరిగింది. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకాభిమానులు ఆశ్చర్యపోయారు. ప్రభాస్, విష్ణు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ . ఇరువురి మధ్య ఎంతో సఖ్యత ఉంది. మరి ఎందుకు ఇలా విష్ణు మాట్లాడాడని అంతా అనుకున్నారు.
ఐతే, తాజాగా ఈ వ్యాఖ్యలపై విష్ణు ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రచారం లో ఉన్న వ్యాఖ్యలు తాను చెయ్యలేదని, జిన్నా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సో కాల్డ్ ఐటెం రాజానే కావాలని ఇలా తనపై నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని విష్ణు పేర్కొన్నారు. అలానే తన డార్లింగ్ బ్రదర్ ప్రభాస్ కి అంతా మంచే జరగాలని విష్ణు ఈ సందర్భంగా కోరుకున్నారు.