టాలీవుడ్ హీరో నరేష్ 59వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం". ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 28వ తేదీన ఈ మూవీ నుండి బిగ్ అప్డేట్ రాబోతున్నట్టు పేర్కొన్నారు.
ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఏఆర్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.