'కుమారి 21F' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్. ఆపై వరస సినిమాలలో హీరోయిన్ గా చేసిన హెబ్బా తదుపరి కాస్త వేగాన్ని తగ్గించి సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటుంది.
ఓదెల రైల్వే స్టేషన్ తో ఇటీవలే ఓటిటి ఆడియన్స్ ను పలకరించిన హెబ్బా పటేల్ శాసనసభ సినిమాలో ఐటెం సాంగ్ లో డాన్స్ చేయబోతుంది.
ప్రస్తుతం హెబ్బా కాశ్మీర్ టూర్ లో ఉంది. అక్కడి అందమైన ప్రదేశాలను చూస్తూ తనను తాను మైమరిచిపోతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, అక్కడి విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది.