నేషనల్ క్రష్ రష్మికకు "పుష్ప" తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అప్పటివరకు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న రష్మిక పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపొయింది. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో వరస సినిమా అవకాశాలను చేజిక్కించుకున్న రష్మిక ప్రస్తుతం వాటిని పూర్తి చేసే పనిలో ఉంది.
తాజాగా రష్మిక నటించిన "గుడ్ బై" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రష్మిక ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గుడ్ బై సినిమాకు గుడ్ బై చెప్పటం ఇష్టం లేదని, ఇదే చిత్రబృందంతో త్వరలోనే పని చెయ్యాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. ఈ సినిమా ప్రారంభమై రెండేళ్లు కావొస్తుందని, ఈ మధ్యలో కరోనా ఆటంకమొచ్చినా మూవీ షూటింగ్ సెలెబ్రేషన్స్ ను ఆపలేదని, ఈ సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైందని, విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది. అలానే, ఈ సినిమాలో బిగ్ బి తో నటించే అవకాశం వచ్చినందుకు తానెంతో అదృష్టవంతురాలినని, ప్రపంచంలోని అత్యుత్తమవారిలో అమితాబ్ ఒకరని కామెంట్ చేసింది. వికాస్ బహెల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రష్మిక మండన్నా, నీనా గుప్త, శివిన్ నారంగ్ తదితరులు నటిస్తుండగా, బాలాజీ మోషన్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.