ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ కు "గుడ్ బై" చెప్పేసిన రష్మిక...!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 04:28 PM

నేషనల్ క్రష్ రష్మికకు "పుష్ప" తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అప్పటివరకు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న రష్మిక పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపొయింది. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో వరస సినిమా అవకాశాలను చేజిక్కించుకున్న రష్మిక ప్రస్తుతం వాటిని పూర్తి చేసే పనిలో ఉంది.
తాజాగా రష్మిక నటించిన "గుడ్ బై" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రష్మిక ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గుడ్ బై సినిమాకు గుడ్ బై చెప్పటం ఇష్టం లేదని, ఇదే చిత్రబృందంతో త్వరలోనే పని చెయ్యాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.  ఈ సినిమా ప్రారంభమై రెండేళ్లు కావొస్తుందని, ఈ మధ్యలో కరోనా ఆటంకమొచ్చినా మూవీ షూటింగ్ సెలెబ్రేషన్స్ ను ఆపలేదని, ఈ సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైందని, విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొంది. అలానే, ఈ సినిమాలో బిగ్ బి తో నటించే అవకాశం వచ్చినందుకు తానెంతో అదృష్టవంతురాలినని, ప్రపంచంలోని అత్యుత్తమవారిలో అమితాబ్ ఒకరని కామెంట్ చేసింది. వికాస్ బహెల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రష్మిక మండన్నా, నీనా గుప్త, శివిన్ నారంగ్ తదితరులు నటిస్తుండగా, బాలాజీ మోషన్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com