ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నారన్న విషయం తెలిసిందే. కెరీర్ పరంగా చరణ్కిది 15వ సినిమా. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ లోని కొన్ని కీలక సన్నివేశాలను ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలో చిత్రీకరించారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు లీకవడంతో ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపిస్తారని అర్ధమవుతుంది. అయితే, ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
తాజాగా ఈ మూవీపై మరొక లేటెస్ట్ ఇంటరెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే....బాలీవుడ్ రీల్ లైఫ్ అత్తాకోడళ్ళయిన నీతూకపూర్, కియారా అద్వానీ ఇందులో కూడా అత్తాకోడళ్ళుగా కనిపించబోతున్నారట. వీరిద్దరూ అత్తాకోడళ్ళుగా నటించిన "జగ్ జగ్ జీయో" చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తల్లి నీతూకపూర్. RC 15లో చరణ్ కు తల్లిగా, కియారకు అత్తగారిగా నటించటానికి బాలీవుడ్ నుండి నీతూకపూర్ ను రంగంలోకి దింపబోతున్నారట శంకర్. మరి ఈ వార్తలో నిజానిజాలేంతో తెలియాల్సి ఉంది.