శశికిరణ్ తిక్కా డైరెక్షన్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన "మేజర్" సినిమా జూన్ 3 న థియేటర్లలో విడుదలైంది. విడుదల తేదికి దాదాపు రెండు వారాల ముందు నుండి మేజర్ దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో, సెలెక్టెడ్ థియేటర్లలో ప్రదర్శింపబడింది. యూనివర్సల్ సబ్జెక్టు కావడంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా మేజర్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అలానే విడుదలైన తర్వాత కూడా ఈ పాజిటివ్ టాక్ కంటిన్యూ అయ్యింది. దీంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. మేజర్ వేసిన బాటలోనే కన్నడ నటుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన '777చార్లీ' మూవీ కూడా విడుదలకు ముందే పెయిడ్ ప్రీమియర్స్ పేరిట దేశవ్యాప్తంగా ప్రత్యేక షోలను నిర్వహించారు. ఈ షోలకు సినిమా పట్ల పాజిటివ్ టాక్ వినిపించింది కానీ,విడుదల తర్వాత మూవీ హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది.
కిరణ్ రాజ్ దర్శకత్వంలో కామెడీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని జి.ఎస్ గుప్తా తో కలిసి రక్షిత్ శెట్టి నిర్మించారు. సినిమాకు ప్రేక్షకుల నుండి ముఖ్యంగా పెంపుడు కుక్కలను ప్రాణంగా చూసుకునే వారినుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవ్వలేదు. 777చార్లీ ఒక ఫీల్ గుడ్ మూవీగా మాత్రమే మిగిలిపోయింది.