ప్రేమమ్, శతమానం భవతి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్గా మారిపోయింది అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఆమె నటించిన 'బటర్ ఫ్లై' సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'భీమ్లానాయక్' సినిమాను హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో బురఖా వేసుకుని వెళ్లి, చూశానని తెలిపింది. పవన్ కళ్యాణ్కు తాను అభిమానినని, ఆయన గురించి అభిప్రాయం చెప్పే స్థాయి లేదని పేర్కొంది.