బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రం కభీ ఈద్ కభీ దివాళి. ఇందులో పూజా హెగ్డే కధానాయిక. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కీలకపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. వెంకటేష్, పూజాహెగ్డే అన్నాచెల్లెళ్లుగా నటించబోతున్నారని టాక్. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలావుండగా, తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరో కమ్ విలన్ జగపతిబాబు నటించబోతున్నట్టు బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తుంది. సల్మాన్ తో జగపతిబాబు నటించటం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ మూవీ దబాంగ్ 3 లో కూడా జగపతిబాబు కీ రోల్ ప్లే చేసారు. కభీ ఈద్ కభీ దివాళి లో సల్మాన్ ను ఢీకొట్టే పవర్ఫుల్ పాత్రలో జగపతిబాబు నటించబోతున్నాడట. హైదరాబాద్ లో జూన్ నుండి జరగబోయే షెడ్యూల్ లో జగపతిబాబు జాయిన్ అవ్వనున్నారట. ఫర్హాద్ సంజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది.