కడప: కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ ట్రాలీ కింద చిక్కుకొని మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరో 25 మంది కూలీలకు గాయాలయ్యాయి. కూలీలతో వెళ్తుండగా ట్రాక్టర్కు ఈ ప్రమాదం సంభవించింది.