విశాఖ: సాంకేతికత, పారిశ్రామిక రంగాల్లో ఏపీ ముందుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధికి సాంకేతికత దోహదం చేస్తోందన్నారు. విశాఖలో భూమిని అభివృద్ధి చేసి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆటోమొబైల్, టెక్స్టైల్ వంటి రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని, ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. వచ్చే నెలలో విశాఖలో మరోసారి సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తామని అన్నారు. ఇప్పటికీ రెండుసార్లు సీఐఐ భాగస్వామ్య సదస్సులు నిర్వహించామన్నారు. సదస్సులో పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని పేర్కొన్నారు. విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహక సమావేశం ఇవాళ ఢిల్లిdలో జరుగుతుందన్నారు. సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు ఇవాళ ఢిల్లిd వెళ్తున్నానన్నారు.