ఏలూరు: కోడి పందేలపై పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రెండు కోళ్లు ఎదురు పడితే పోట్లాడుకోవడం సహజం... ఇది పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం’ అని ఆయన అన్నారు. దీనికి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ అవసరం లేదన్నారు. అలాగే జల్లికట్టు నెల రోజులు జరుగుతుందని, అదే కోడి పందేలు మాత్రం 4 రోజులు మాత్రమే జరుగుతాయని ఎంపీ అన్నారు.