ప్రధాని నరేంద్రమోడీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ ప్రారంభమైంది. మోడీతో భేటీ కోసం నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు ఈ ఉదయం 10.40గంటలకు ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలు, పోలవరం పనులు, నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై వీరిరువురు చర్చించారు. అలాగే రెవెన్యూలోటు, అమరావతి నిర్మాణానికి సహకారం తదితర అంశాలను కూడా చంద్రబాబు మోడీతో భేటీలో ప్రస్తావించారు. కేంద్రం హామీ మేరకు రాష్ట్రానికి దక్కాల్సినవి బాబు ఈ సందర్భంగా మోడీకి గుర్తు చేశారు. రెవెన్యూలోటు పూడ్చేందుకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే ఇవ్వాలని మోడీని కోరారు. విశాఖ పట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. విభజన హామీ మేరకు సాధ్యమైనంత త్వరగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్రమోడీతో కొద్ది సేపటి కిందట చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు ఏడాది తరువాత వీరిరువురి మధ్యా భేటీ జరగడం ఇదే మొదటి సారి కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.