ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కురవి ఆలయాభివృద్ధికి నేడు మంత్రుల శంకుస్థాపన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2018, 11:03 AM

హైదరాబాద్: : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయాన్ని రూ.5 కోట్లతో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులకు నేడు రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేయనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా 2017లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కురవి వీరభద్రస్వామిని దర్శించుకొని తెలంగాణ మొక్కులు చెల్లించుకున్నారు. వీరభద్రస్వామికి కోర మీసం సమర్పించారు. అదే సందర్భంలో ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు ప్రకటించారు. ఆ నిధులతో దేవాలయంలో 17 రకాల పనులను చేపట్టనున్నారు. రూ.75 లక్షలతో ఆలయ ప్రాకారం, రూ.48 లక్షలతో బంజారా సత్రం, మూడంతస్తుల్లో రాజగోపుర నిర్మాణం వంటి పనులు పూర్తిచేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com