శ్రీనగర్ : ఉగ్రవాదులు తమ సోదరులని, వారు అమరవీరులని, వారి మరణించినందుకు సంబరాలు చేసుకోకూడదని జమ్ము కాశ్మీర్లో అధికారంలో ఉన్న పిడిపికి చెందిన ఎమ్మెల్యే ఐజాజ్ అహ్మద్ మీర్ వ్యాఖ్యానించారు. మీర్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తీవ్రవాదులు జమ్ము కాశ్మీర్కు చెందిన వారని, వారు తమ సంతానమని ఆయన చెప్పారు. వారిని చంపినప్పుడు సంబరాలు చేసుకోకూడదని ఆయన అన్నారు. ఉగ్రవాదులతో పోరాటంలో మృతి చెందిన జవాన్ల పట్ల కూడా తమకు సానుభూతి ఉందని ఆయన అన్నారు.