ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 11, 2018, 02:18 PM

గతంలో జల విద్యుత్ ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు చేపట్టినప్పుడు ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆయనను నిర్దోషిగా తేలుస్తూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చి ఆయనకు ఊరటనిచ్చింది. కాగా, ఈ కేసులో సుప్రీం కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేయగా పినరయితోపాటు మరో ఇద్దరు నిందితులకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో స్పందించాలని ఆదేశించింది. 1995లో సంకీర్ణ ప్రభుత్వంలో పినరయి విజయన్ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. కెనడా కంపెనీ ఎస్ఎన్‌సీ-లావలీన్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com