ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉభయ తెలుగు రాష్ట్రాలలో భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2017, 10:13 AM

హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాలలో వైకుంఠ ఏకాసి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. మంగళగిరి, ద్వారకా తిరుమల, యాదాద్రి, భద్రాద్రి, ధర్మ పురి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ లోని బిర్లా మందిర్ కూడా తెల్లవారు జామునుంచే భక్తజనంతో కిటకిటలాడుతోంది. ఆలయాల వద్ద పెద్ద పెద్ద క్యూలైన్లలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరి ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com