హైదరాబాద్ : తాడి- దువ్వాడ రైల్వేస్టేషన్ల మధ్య ట్రాక్ మరమ్మతుల కారణంగా విజయవాడ- విశాఖ మధ్య పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో అధికారి ఉమాశంకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబరు 67295 రాజమండ్రి - రవికంపాడు మధ్య నడిచే రైలును 29, 31 రోజుల్లో రద్దు చేశారు. అదే విధంగా రైలు నెంబరు 67247 రవికంపాడు- విశాఖపట్నంల మధ్య నడిచే రైళ్లు 29, 31 రెండు రోజులు రద్దు చేశారు. రైలు నెంబరు 57255 కాకినాడ పోర్టు -విశాఖపట్నం (అనకాపల్లి- విశాఖపట్నం) రైల్వేస్టేషన్ల మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు 29, 31 రెండు రోజులలో పాక్షికంగా రద్దు చేయగా.. విశాఖపట్నం -కాకినాడ పోర్టుల మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.