బీజాపూర్: బీజాపూర్ జిల్లా మెట్లచెరువు వద్ద ఈ రోజు సాయంత్రం ఓ ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సును మావోయిస్టులు తగులబెట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం నుండి చత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ కు 25 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సును మావోయిస్టులు అడ్డుకున్నారు. అనంతరం బస్సు నుంచి ప్రయాణికులందరినీ కిందకు దింపి, దాని ట్యాంకును పగలగొట్టి నిప్పు పెట్టారు. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.