విజయవాడ : తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నేడు సమావేశం కానుంది. ఏపీలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల పేర్లను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు చేసిన సీఎం చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.