న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మూగబోయాయి. గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ర్టాల్లో కాంగ్రెస్ వెనుకంజలో ఉండటంతో ఆ పార్టీ నేతలు తమ నివాసాలకే పరిమితమయ్యారు. దీంతో ఆ పార్టీ ఆఫీసులన్నీ జనాలు లేక వెలవెల బోతున్నాయి. అనుకున్నంతా స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు కలవరానికి గురవుతున్నారు. ఇక ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ సోనియాను కలిసి మాట్లాడారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మీడియాతో రాహుల్ మాట్లాడనున్నారు.