గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టి20 మ్యాచ్ ను తలపిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ ఇరు పార్టీల ఆధిక్యతలూ మారుతూ వస్తున్నాయి. గుజరాత్ గ్రామీణంలో కాంగ్రెస్ దూసుకుపోతుండగా, రాష్ట్రంలోని దక్షిణ, మధ్య ప్రాంతంలో బీజేపీ ఆధిక్యతలో ఉంది. ఇరు పార్టీలూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఫొటో ఫినిష్ తప్పదని పిస్తున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సరళిని బట్టి చూస్తే ఇరు పార్టీలలో దేనికీ కూడా సంపూర్ణ మెజారిటీ లభించే అవకాశం కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధిక్యతలు ఇలా ఉన్నాయి. బీజేపీ 88 స్థానాలలో ముందంజలో ఉంటే, కాంగ్రెస్ 90 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది.