గుంటూరు: ప్రతి నియోజకవర్గానికి రూ.2కోట్లతో స్టేడియాల నిర్మాణం చేయనున్నట్లు మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. ఇవాళ గుంటూరు బ్రహ్మానందరెడ్డి క్రీడా ప్రాంగణంలో రాష్ట్రస్థాయి హాకీ ఛాంపియన్షిప్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్టేడియా ఉండేలా చర్యలు తీసుకుంటుందన్నారు. గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియాన్ని అత్యాధునిక హంగులతో ఆధునీకరిస్తామని మంత్రి పేర్కొన్నారు.