చెప్పను బ్రదర్' కాంట్రవర్సీకి తెర వేసేసానని అల్లు అర్జున్ భావిస్తున్నాడు కానీ అప్పుడు రగులుకున్న నిప్పు ఇంకా మండుతూనే వుంది. ఇంకా చెప్పాలంటే ఆ వివాదం ఇంకా ఇంకా ముదురుతోంది. అల్లు అర్జున్ని ద్వేషిస్తూ ఒక వర్గం పుట్టుకొచ్చేసింది.'దువ్వాడ జగన్నాథమ్' ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్తో ఇది పతాక స్థాయికి చేరుకుంది. ఈ టీజర్ని యూట్యూబ్లో డిస్లైక్ చేస్తున్న వారి సంఖ్య వేలల్లో వుంది. సాధారణంగా యాంటీ ఫాన్స్ నుంచి డిస్లైక్స్ అయితే పడుతూనే వుంటాయి కానీ ఇదయితే పెను ఉప్పెనలా జరగడం చూస్తుంటే పనిగట్టుకుని ఒక వర్గం ఇది చేస్తోందని అర్థమవుతోంది.ఇదిలావుంటే అల్లు శిరీష్ వల్ల ఈ అఘాతం మరింత పెరిగిందని, అతను ట్విట్టర్లో సాయిధరమ్ తేజ్ని, పవన్కళ్యాణ్ని అన్ఫాలో అవడం గమనించిన వాళ్లు ఈ విషయాన్ని తెరమీదకు తెచ్చారు. అలాగే పవన్ని ఏకవచనంలో సంభోదిస్తూ అల్లు శిరీష్ చేసిన ప్రైవేట్ సంభాషణలు కూడా వెలుగులోకి వచ్చాయి.అయితే ఇవి మార్ఫ్ చేసినవని, కావాలని అల్లు వారికి పవన్తో విబేధాలున్నట్టు సృష్టిస్తున్నారని ఖండనలు కూడా జరిగాయి. కానీ అసలే సెన్సిటివ్గా వుండే ఫాన్స్ ఇప్పుడు మరింతగా రగిలిపోతున్నారు. దువ్వాడ టీజర్ రిలీజ్కే ఇంత హేట్ కనిపిస్తూ వుంటే ఇక సినిమా రిలీజ్ అయినప్పుడు నెగెటివిటీ ఇంకెంత ముదురుతుందో? ఈ వివాదానికి ఒకేసారి తెర దించుతూ అల్లు అర్జున్, పవన్ కలిసి కనిపించేస్తే సరి అనేది న్యూట్రల్స్ ఇస్తోన్న సలహా.