మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఎన్నో ఆశలు, అంచనాలతో ఈ సారి ‘విన్నర్’ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. ‘తిక్క’ సినిమా ఇచ్చిన షాక్ నుంచి కోలుకున్నాక చాలా జాగ్రత్తగా స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలని భావించిన తేజు.. ఈ విషయంలో నిజంగానే జాగ్రత్తగా వ్యవహరించాడట. తేజు ఆలోచన పనిచేసి.. ఈ సారి సెలెక్షన్ కరెక్ట్ అయ్యింది. తేజుకు కావాల్సిన మంచి బ్రేక్ వచ్చేసింది. అనుకున్నదాని కంటే కూడా ‘విన్నర్’ సినిమా సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. సుప్రీమ్ సినిమా కలెక్షన్ల కంటే కూడా ‘విన్నర్’ కలెక్షన్లు భారీగా ఉన్నాయనీ, దీన్ని ఎవరూ ఊహించలేదనీ అంటున్నారు.మంచి డైరెక్టర్, మంచి కథ తోడైతే సక్సెస్ ఖచ్చితంగా వస్తుందనేది అందరికీ తెలిసిందే. కథల ఎంపిక విషయంలో బాగా ఆలోచించాలంటూ మెగాస్టార్ చిరంజీవి తేజుకు ఇచ్చిన సలహా మొత్తానికి బ్రహ్మాండంగా పనిచేసింది. కుర్రతనంలో ఏది పడితే అది ఓకే చేసేసి.. ఆ తర్వాత తల పట్టుకోవటం కంటే, ఆలోచించి కథ ఎంపిక చేసుకోవాలని చెప్పిన చిరు సలహా మొత్తానికి తేజుకు పెద్ద సక్సెస్ తెచ్చి పెట్టింది. అంతే కాకుండా.. ఇక ముందు కూడా స్టోరీ ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరమని తెలిసి వచ్చింది. మొత్తానికి.. తేజు ఈ సారి సక్సెస్ తో టూ మచ్ హ్యాప్పీ.