హిమాచల్ప్రదేశ్ : హిల్స్టేషన్ ప్రాంతంలోని గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కులో మంచు చిరుతపులి (స్నో లియోపార్డ్) కెమెరా కంటికి చిక్కింది. మంచు చిరుత రాళ్ల మధ్య తిరుగుతుండగా..పార్కులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాలు ఫొటోలను క్లిక్మనించాయి. తీర్థన్ వ్యాలీలో మంచు చిరుత కనిపించడం ఇదే మొదటిసారి అని విల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ తెలిపారు. మంచుచిరుతపులి శాస్త్రీయ నామం పాంథేరా అన్సియా.