మోదీ ప్రభుత్వం గత మూడేళ్లలో పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే స్టన్ కావాల్సిందే. సుమారు రూ.3755 కోట్లు కేవలం ప్రచారం కోసం మోదీ ప్రభుత్వం ఖర్చు చేసిందట. సమాచార హక్కు చట్టం కింద వేసిన ప్రశ్నకు శుక్రవారం ప్రభుత్వం ఈ సమాధానం ఇచ్చింది. ఏప్రిల్ 2014 నుంచి అక్టోబర్ 2017 వరకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఔట్డోర్ పబ్లిసిటీ కోసం రూ.37,54,06,23,616 ఖర్చు చేసినట్లు తేలింది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. గ్రేటర్ నోయిడాకు చెందిన సామాజిక కార్యకర్త రామ్వీర్ తన్వార్ వేసిన ఆర్టీఐ ఫిర్యాదుకు ప్రభుత్వం ఈ సమాధానం ఇచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్ల కోసమే సుమారు రూ.1656 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రేడియో, డిజిటల్ సినిమా, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్, టీవీలు ఉన్నాయి. ఇక ప్రింట్ మీడియా కోసం రూ.1698 కోట్లు ఖర్చు చేశారట.