ఒడిశాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కొరాపుట్ జిల్లా దుమ్మిరిపుట్-దమన్జోడి మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కొరాపుట్-రాయ్గడ మార్గంలో గూడ్స్ రైలు 6 బోగీలు పట్టాలు తప్పడంతో రైల్వే అధికారులు 6 రైళ్లను రద్దు చేశారు. వెంటనే తూర్పు కోస్తా రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. కొరాపుట్-విజయనగరం మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.