ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ప్రయాణం సుఖాంతం చేసుకోండి...బడ్జెట్ టూర్ కు తెరలేపిన ఆన్ లైన్ ట్రావెల్ ప్లాట్ ఫామ్

business |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 03:44 PM

ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ క్లియర్‌ట్రిప్ కు డిస్కౌంట్ చిట్కా బాగా కలిసొస్తోంది. అదే సందర్భంలో క్లియర్‌ట్రిప్ తన తాజా క్యాంపెయిన్‌ ‘అబ్ ఇస్ సే అచ్చీ క్యా గుడ్‌న్యూస్!’ ను కూడా లాంచ్ చేసింది. ఈ క్యాంపెయిన్ ద్వారా ట్రావెల్ బుకింగ్స్‌పై తాను అందిస్తోన్న డిస్కౌంట్లను ప్రయాణికులకు తెలియజేస్తోంది. తమ ట్రావెల్ కలలను సాకారం చేసుకునేందుకు తమ డిస్కౌంట్ ఆఫర్లు ఎంతో సహకరిస్తాయని కంపెనీ పేర్కొంటోంది. ఇదిలావుంటే క్లియర్‌ట్రిప్ తత్కాల్‌ కార్యక్రమం ద్వారా ఈ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ అన్ని దేశీయ విమానాలు, హోటల్స్‌‌ బుకింగ్స్‌పై 50 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. అయితే పరిమిత బుకింగ్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. బుధవారం నుంచి ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు క్లియర్‌క్రిప్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ తగ్గింపు ధరలను అందిస్తోంది. ట్రావెల్ బుకింగ్స్‌పై ఇంతకుముందు ఎన్నడూ లేని డిస్కౌంట్లను ఈ ట్రావెల్ కంపెనీ ప్రవేశపెట్టింది. వేసవి కాలంలో పర్యటనలకు వెళ్లాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ క్లియర్‌ట్రిప్ తత్కాల్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది.


ప్రయాణాల్లో తాము ఊహిచనంత డిమాండ్ ఏర్పడిందని, ఈ డిమాండ్ మరింత పెరగనుందని క్లియర్‌ట్రిప్ సీఎంఓ కునాల్ దూబే అన్నారు. ప్రయాణికులు వేసవి సెలవులను ప్లాన్ చేసుకుంటోన్న సమయంలో తాము క్లియర్ ట్రిప్ తత్కాల్‌ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఆన్‌లైన్ ట్రావెల్ విభాగంలో గతంలో ఎన్నడూ చూడని ఆఫర్లను క్లియర్‌ట్రిప్ తత్కాల్ కింద అందిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని దేశీయ విమానాలు, హోటల్స్‌పై ఏకమొత్తంలో 50 శాతం తగ్గింపును అందిస్తోన్న ఏకైక ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ తమదేనని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com