అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 26వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లా నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. జగన్ తన 26వ రోజు పాదయాత్రను అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి నుంచి ప్రారంభించారు. పాదయాత్ర బసినేపల్లి మీదుగా గుత్తి వరకు కొనసాగనుంది. సాయంత్రం గుత్తిలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.