చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని భజంత్రీ వీధిలోని బీటెక్ విద్యార్థి దిలీప్ రెడ్డి (20) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అద్దెకు ఉంటున్న గదిలో పైకప్పుకు పంచెతో ఉరి వేసుకుని చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడ్డాడు. అందులో తీవ్రంగా నష్టం రావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక పోలీసులు తెలిపారు.