కొయ్యురు మండలం వెలగలపాలెం పంచాయితీ లో కలెక్టర్ అదేశాల ప్రకారం పంచాయితీ లో అన్ని గ్రామాలలో మలేరియా కేసులు రాకుండా ముందస్తుగా మలేరియా మందు పిచికారీ చేయించారు. పంచాయితీ ప్రజలకు రానున్న వర్షాకాలంలో మలేరియా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇడవాడ రత్నకుమారి, కార్యదర్శి పి. సన్యాసిరావు, మహిళపోలీస్ లలితావేణి, వైసీపీ నాయకులు సత్యనారాయణ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.