అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి పంచాయతీ పరిధిలోని ఘాట్ రోడ్డు వద్ద వెలసిన శ్రీ చితాలమ్మ అమ్మవారి ఉత్సవాలు మే 19 నుండి 21 వరకు కొయ్యూరు, కృష్ణదేవి పేట మోటార్ యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 20 గ్రామాల ప్రజలు భక్తులు అమ్మవారికి ఘటాలతో డప్పు వాయిద్యాలతో భారీ సంఖ్యలో అమ్మవారిని బోనాలతో వచ్చి దర్శించుకున్నా. ఆలయం వద్ద భక్తులకు త్రాగునీరు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రజాప్రతినిధులు దాతలు స్పందించి ఆలయం వద్ద త్రాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.