దక్షిణ తమిళనాడు కోస్తా జిల్లాలకు తుఫాను పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, కన్యాకుమారికి ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండంగా మారిందని పేర్కొంది. తీవ్ర వాయుగుండం మరింత బలపడి ఇవాళ రాత్రిలోగా తుఫానుగా మారే అవకాశం ఉందని, వాయుగుండం బలపడితే దక్షిణ తమిళనాడు కోస్తా జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తోంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను ముప్పు పొంచి ఉండడంతో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.