తిరుమల: తిరుమలలో పద్మావతి అమ్మవారి సారె ఊరేగింపు వైభవంగా జరిగింది. ఈ సారె ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచి తిరువీధుల్లో కొనసాగి తిరుచానూరుకు చేరుకుంది. తిరుచానారు పంచమితీర్థం మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచమీ తీర్థం రోజున పసుపు కుంకుమ సారె తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిది నుంచి పద్మావతి దేవేరికి టీటీడీ సారె తీసుకెళ్లడం ఆనవాయితీ. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు పంచమి తీర్థం కార్యక్రమం జరగనుంది. ఉదయం 11.48 గంటలకు మకరలగ్నంలో పంచమీతీర్థం(చక్రస్నానం) నిర్వహణ.