రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్పై కేసు నమోదు అయ్యింది. ఈ టాయిలెట్ ల తయారీకి టెండర్ పేరుతో మోసానికి పాల్పడినందుకు అశోక్ గెహ్లాట్ కుమారుడు సహా 15 మందిపై గంగాపూర్ పోలీసులు నాసిక్లో చీటింగ్ కేసు నమోదు చేశారు. గంగాపూర్ పోలీసులు 15 మందిపై చీటింగ్, క్రిమినల్ బెదిరింపు కేసు నమోదు చేశారు. ఈ విషయానికి సంబంధించి, నాసిక్ పోలీస్ కమిషనర్ దీపక్ పాండే సోమవారం మాట్లాడుతూ, ఈ వ్యవహారాన్ని ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేయాలని అధికారులను ఆదేశిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ సహా 15 మందిపై రూ.ఆరు కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రాజస్థాన్లో ఈ టాయిలెట్ల తయారీ టెండర్ పేరుతో ఈ మోసం జరిగింది. ఈ ఘటనపై మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ సహా 15 మందిపై గంగాపూర్ పోలీసులు 33 ఏళ్ల వ్యాపారవేత్తను రూ. 6.8 కోట్ల మోసం చేశారనే ఆరోపణలపై చీటింగ్, క్రిమినల్ బెదిరింపు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.