ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరాపురంలో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 09:49 AM

అమరాపురం మండల పరిధిలోని మద్దనకుంట గ్రామంలో వడ్డే సహదేవా(29)సంవత్సరం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు తిమ్మారెడ్డి కుమారుడు సహదేవా తన వ్యవసాయ పొలంలో కరెంట్ స్టార్టర్ పెట్టెలో ఫీజులు వేస్తూ ఉండగా, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి పడిపోయాడని, వెంటనే అతనిని చికిత్స నిమిత్తం అమరాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిగా చికిత్స అందించిన డాక్టర్లు మెరువైన వైద్యంకోసం మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవాలని సూచించడంతో వెంటనే 108 లో తరలించిగా అక్కడి డాక్టర్ పరీక్ష చేయగా మృతి చెందిచాలాసేపు అయ్యిందని తెలిపారన్నారు.


మృతుడి భార్య నేత్ర ఫిర్యాదు మేరకు అమరాపురం ఏఎస్సై రామాంజనేయులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోస్టుమార్టం కోసం మార్చురీ రూముకు తరలించగా ఆ శవాన్ని సిఐ శ్రీరామ్ పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు దయన 9 సం. , నయన 7సం. వున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com