యాడికి లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు జేసి అస్మిత్ రెడ్డి లను ఆహ్వాన పలుకుతూ టిడిపి నాయకులు చేసిన హంగామా పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామకృష్ణ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 18వ న తమ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డి పట్ట ణంలోని కి అడుగిడగానే స్వాగతిస్తూ టిడిపి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ బాణాసంచా పేల్చారు. రథోత్సవంలో స్వామివారిని దర్శించు కొనుటలో భాగంగా వచ్చిన ప్రజలకు ఇబ్బంది కలిగించారని దీంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించారన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టిడిపి నాయకులు 5 మంది పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా మాజీ ఎంపీపీ వేలూరి రంగయ్య, గొర్తి రుద్రమ నాయుడు, పరిమి చరణ్, నాగ శేఖర్, మధు రాజు కేసు నమోదు అయిన వారిలో ఉన్నారు.