కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని బీటెక్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది నవంబరులో జరిగిన 2వ సెమిస్టర్ పరీక్షలకు 152 మంది విద్యార్థులకుగాను 68 మంది పాసయ్యారు.
2021 ఆగస్టులో జరిగిన ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు 157 మందికిగాను 65, థర్డ్ సెమిస్టర్ పరీక్షలకు 227 మందికిగాను, 114 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ లో చూసుకోవచ్చన్నారు.