కర్నూలులో ఓ వివాహిత ఫిర్యాదు మేరకు అదనపు కట్నం కోసం విధిస్తున్న భర్త, అత్తపై కేసు నమోదు చేసినట్లు కర్నూలు ఒకటవ పట్టణ పోలీసులు తెలిపారు. స్థానిక ఏకల వ్యనగర్కు చెందిన శ్రావణిబాయికి కుమ్మరిగేరికి చెందిన భవానిసింగ్ 12 ఏళ్ల క్రితం వివాహమైంది.
వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం భర్త శారీరకంగా, మానసికంగా, వేధిస్తున్నారని, ఇందుకు అత్త రాధాబాయి కూడా సహకరిస్తుందని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. శ్రావణిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.