రైతు కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మండల జడ్పీటీసీ రామకృష్ణ అన్నారు. కొత్తపల్లి రిజర్వాయర్కు వెళ్లే హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా సోమవారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరామ్ ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో సంప్రదించి నీటిని విడుదలకు కృషి చేశారన్నారు. జగనన్న ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు హంపీ రెడ్డి, రామచంద్ర పాల్గొన్నారు.