నేరానికి పాల్పడిన వారు కచ్చితంగా చట్టం నుండి తప్పించుకోలేరని అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. అవనిగడ్డ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ అవనిగడ్డ స్టేట్ బ్యాంక్ సెంటర్ నందు గల పండ్ల దుకాణంలో ఇప్పటికి పలుమార్లు పండ్లు దొంగతనం జరిగింది అని షాపు యజమాని యక్కటి మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవనిగడ్డ పోలీసులు షాపు ప్రాంగణంలో సిసి కెమెరాలతో పాటు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ద్వార ఈనెల 19వ తేదీన జరిగిన దొంగతనాన్ని గుర్తించి అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశ్వరావు పాలెంకు చెందిన రేపల్లె ఆనంద్ కిషోర్ ను అదుపులోకి తీసుకుని అతని వద్దనుండి 50 వేల రూపాయల విలువ కలిగిన పండ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహబూబ్బాషా వెల్లడించారు. నిందితుడిని గుర్తించడంలో సహకరించిన అశ్వరావు పాలెం కు చెందిన మహిళా పోలీసు ప్రత్యూష ను ఎల్ హెచ్ ఎం ఎస్ ఆపరేటర్ అనిల్ ను పోలీసు అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ జి శ్రీనివాస్ అవనిగడ్డ ఎస్ఐ కె శ్రీనివాసరావు, మోపిదేవి ఎస్ఐ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.