ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నాటు సారా మరియు కల్తీ మద్యం వలన ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి అని జంగా రెడ్డి గూడెం ఘటనతో బయటపడింది. కానీ ప్రభుటీం మాత్రం అవి సహజ మరణాలుగా చిత్రీకరణ చేసింది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీ ఐన టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి నియోజక వర్గం ధర్నాలు, రాస్తా రోకులతో వేడెక్కుతున్నది. ఐతే తాజాగా విచ్చలవిడి సారా అమ్మకాలు, ప్రాణాంతక జె బ్రాండ్లతో మహిళల తాళిబొట్లు తెంచేస్తోన్న జగన్ రెడ్డి సర్కారుపై టిడిపి ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం అయ్యింది. మంగళగిరి నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించిన టిడిపి, ప్రాణాలు తీసే మద్యం వద్దు అంటూ నినదించారు.