కర్నూలులో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ప్రశిక్షణా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల సమావేశంలో బీజేపీ నాయకులూ సోము వీర్రాజు మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది. రాష్ట్ర అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ కృషిని తక్కువచేసి మాట్లాడుతున్న జగన్ మరియు ప్రభుత్వ పెద్దలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తున్నాను. కేంద్ర నిధుల సహకారంతో పాలన సాగిస్తూ ప్రజలలో మోదీ ముద్రను చేరిపెయ్యాలన్న మీ ఆలోచనలకు ప్రతిగా బీజేపీ మరియు జనసేన పార్టీ సంయుక్తంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతాం అని హెచ్చరించారు.