దేశంలోనే మొదటి ‘పేపర్లెస్’ అసెంబ్లీ ఉన్న రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది. అక్కడ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్(NeVA) ప్రోగ్రామ్ను అమలు చేస్తున్నారు. 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రతి టేబుల్పై ఈ-బుక్ లేదా ట్యాబ్లెట్ను అమర్చారు. సభ్యులు అసెంబ్లీ కార్యకలాపాలను వీటిలోనే చూసుకోవచ్చు. పేపర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.