జంగారెడ్డి గూడెం పరిధిలో కల్తీ సారా వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అని తెలిసిన విషయమే. ఈ సందర్భంగా కల్తీ సారాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జే బ్రాండ్ లిక్కర్ వలన వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 28 ప్రాణాలు బలిగొన్న కల్తీ సారా, జే బ్రాండ్స్ లిక్కర్ పై అసెంబ్లీ లో చర్చ చేపట్టాలని శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు కలిసి నిరసన తెలిపాం. అసెంబ్లీ లో మా పోరాటం వలనే ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాల పై సారా స్థావరాలపై దాడులు మొదలుపెట్టింది అని టీడీపీ నాయకులూ నారా లోకేష్ తెలిపారు.